![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -313 లో..... శ్రీలత, శ్రీవల్లిలు ధన, సందీప్ లని బయటకు తీసుకొని రావడానికి స్టేషన్ కి లాయర్ ని తీసుకొని వెళ్తారు. అక్కడ సీఐ సీతాకాంత్ ఫ్రెండ్ తనని చూసి నువ్వు సీతా ఫ్రెండ్ కదా.. వాళ్ళని వదిలేయ్ అని శ్రీలత అనగానే.. పరిచయాలు ఇక్కడ పని చెయ్యవు అని సీఐ అంటాడు. బెయిల్ తీసుకొని వచ్చామని శ్రీలత అనగానే.. బెయిల్ రాదు జనాలని ఫ్రాడ్ చేసిన కేసు ఇది అని అతను చెప్తాడు. అదంతా చూస్తూ భద్రం నవ్వుకుంటాడు. మా వాళ్ళకేం తెలియదు కావాలనే వాళ్ళని ఆ భద్రం కేసులో ఇరికించాడని శ్రీలత అంటుంది.
వాళ్ళు కూడా తప్పు చేశారంటూ అన్నిటిలో భద్రంతో వాళ్ళ సంతకాలు ఉన్నాయంటూ సీఐ చూపిస్తాడు. ఇప్పుడు మేము రిచ్ దేనికైనా ఒక రేట్ ఉంటుంది. మీకు ఎంత కావాలని శ్రీవల్లి అనగానే.. నాకే లంచం ఇస్తావా ఆవిడని అరెస్ట్ చెయ్యండి అని సీఐ అనగానే.. వద్దు అని శ్రీవల్లి, శ్రీలత రిక్వెస్ట్ చేస్తారు. ఇంకోసారి అలా మాట్లాడితే బాగుండదంటూ సీఐ వార్నింగ్ ఇస్తాడు. శ్రీలత వెళ్తు సందీప్, ధనలని పలకరిస్తుంది. మిమ్మల్ని ఎలాగైనా బయటకు తీసుకొని వస్తామని శ్రీలత వాళ్లతో చెప్తుంది. రామలక్ష్మి రాత్రి వచ్చిన కల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నాకేం కాదు నువ్వు భయపడకు అంటూ సీతాకాంత్ చెప్తాడు.
శ్రీలత, శ్రీవల్లి ఇంటికి వస్తారు. వాళ్ళు ఎక్కడ అని సిరి అడుగుతుంది. బెయిల్ రాదట అని శ్రీలత బాధపడుతుంది. సీతా అన్నయ్య వాళ్ళని బయటకు తీసుకొని వస్తాడని సిరి అనగానే.. ఇప్పుడు వాడు మన మాట వినేలా లేడు భార్య మాట వింటాడని శ్రీలత అంటుంది. నేను చెప్తే కచ్చితంగా అన్నయ్య వింటాడని సిరి సీతాకాంత్ దగ్గరికి వెళ్తుంది. ధన సందీప్ లు బయటకు రావాలంటే ఏం చెయ్యాలో నాకు తెలుసంటూ నవ్వుతుంది శ్రీలత. రామలక్ష్మి టెన్షన్ గా స్వామి దగ్గరికి వస్తుంది. తనకి మరణగండం ఉందని స్వామి చెప్పగానే రామలక్ష్మి భయపడుతుంది. దీనికి సొల్యూషన్ చెప్పండి అని రామలక్ష్మి అనగానే.. నేను త్వరలోనే చెప్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి అని స్వామి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |